బాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబోలో వచ్చిన చిత్రం గుడ్ బై (Goodbye). అక్టోబర్ 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. రేపు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో గుడ్ బై మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 80వ పుట్టినరోజు నేపథ్యంలో గుడ్ బై సినిమా టికెట్స్ ధరను రూ.80గా నిర్ణయించి..లెజెండరీ నటుడికి ముందుగానే ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో మూవీ లవర్స్, సినీ జనాలు రేపు రూ.80కే టికెట్ కొని గుడ్ బై సినిమాను చూసే వీలు కల్పించినట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. గుడ్ బై రష్మిక మందన్నాకు డెబ్యూ ప్రాజెక్టు. కాగా రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.
రష్మిక మందన్నా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నులో నటిస్తుండగా..సినిమా షూటింగ్ పూర్తయింది. మిషన్ మజ్ను విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్కపూర్తో యానిమల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో వారసుడు సినిమాలు చేస్తోంది రష్మిక. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Read Also : Nayanthara | విఘ్నేశ్శివన్-నయనతార సరోగసిపై వివాదం
Read Also : Dheemthanana Song | అల్లు శిరీష్, అనూ ఎమ్మాన్యుయేల్ ధీంతననా సాంగ్..లిరికల్ వీడియో
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ హీరోయిన్ ఫైనల్..లుక్ విడుదల
Read Also : Jaru mitaya lyrical song | జిన్నా నుంచి జారు మిటాయా లిరికల్ వీడియో సాంగ్