టాలీవుడ్ యాక్టర్లు అల్లు శిరీష్ (Allu Sirish), అనూ ఎమ్మాన్యుయేల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రాజెక్టు నుంచి మేకర్స్ తొలి పాట ధీంతననా లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను పూర్ణ చారి రాయగా..సిద్ శ్రీరామ్ పాడాడు. అచు జమని-అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య ఫన్, సీరియస్, రొమాంటిక్ ట్రాక్తో సినిమా సాగనున్నట్టు టీజర్ ద్వారా చెప్పాడు దర్శకుడు. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాంగ్ పై ఓ లుక్కేయండి మరి..
ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్తో అసోసియేట్ అవుతూ గీతాఆర్ట్స్ 2 తెరకెక్కిస్తోంది. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికిఅల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానున్నట్టు సమాచారం.
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ హీరోయిన్ ఫైనల్..లుక్ విడుదల
Read Also : Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు