సెలబ్రిటీ కపుల్ విఘ్నేష్ శివన్-నయనతార సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నయన్-విఘ్నేష్ శివన్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా..ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే నయనతార సరోగసి అంశంపై వివాదం నెలకొంది.
ఈ అంశంపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం స్పందిస్తూ..సరోగసి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల క్రితం పెళ్లయిన జంట సరోగసీ ద్వారా గర్భం దాల్చగలరా..కాల పరిమితి ఉందా..? అని మీడియా సమావేశంలో మంత్రి సుబ్రహ్మణ్యంను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..నయనతార సరోగసి అంశంపై తమ శాఖ వివరణ కోరుతుందని, సరోగసీ చట్టబద్దంగా జరిగిందా..?అనే దానిపై డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విచారణకు ఆదేశిస్తామన్నారు.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్ పూర్తయ్యాక కొన్ని రోజుల్లోనే ఈ ఇద్దరూ తమ తమ సినిమాల షెడ్యూల్తో బిజీగా అయిపోయారు.
Read Also : Allu Arjun | ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..ఫిలింఫేర్ అవార్డులపై అల్లు అర్జున్
Read Also : Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు