టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటి స్నేహ (Sneha)కు ఇద్దరు బిజినెస్ మెన్లు టోకరా వేసినట్టు చెన్నై సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అక్కడి స్థానిక మీడియా కథనం ప్రకారం..ఇద్దరు వ్యాపారవేత్తలు (Chennai businessmen) ఎక్స్పోర్టు బిజినెస్ (Export Business)పేరుతో తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నటి స్నేహకు చెప్పారు. వారి మాటలు నమ్మిన స్నేహ రూ.26 లక్షలు (Rs. 26 Lakh) పెట్టుబడి పెట్టింది.
అయితే సదరు వ్యాపారవేత్తలు ముందుగా చెప్పినట్టు స్నేహకు డబ్బులు తిరిగివ్వడం కానీ, లేదా వడ్డీ చెల్లించడం కానీ చేయలేదు. మోసం జరిగినట్టు గుర్తించిన స్నేహ గుర్తు తెలియని ఆ ఇద్దరు వ్యాపారవేత్తలపై కానథూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగులో రాంచరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంలో చివరి సారిగా కనిపించింది స్నేహ. ప్రస్తుతం తమిళ చిత్రం ‘Shot Boot 3’ లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde saree | పూజాహెగ్డే చీర ఖరీదు తెలిస్తే షాకే..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్లో పూజాహెగ్డే
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక