మక్తల్, ఆగస్టు 16 : నియోజకవర్గంలోని ఆదివారం సెలవు రోజున కూడా ఇసుక తరలింపు కొనసాగడంతో స్థానిక రైతులు విషయాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మాగనూరు మండలం నుంచి మక్తల్ మీదుగా నారాయణపేట వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్లను మాజీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతులు, పర్మిట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై అకడికి చేరుకొని ఇసుక తరలిస్తున్న వాహనాలను పరిశీలించి, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. వాగుల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శివారు వాగుల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, రవాణాపై రెవెన్యూ, పోలీసు అధికారులు నిరంతరం నిఘా పెట్టి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.