టాలీవుడ్ స్టార్ హీరో విజయ్దేవరకొండ (Vijay Deverakonda) సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు.. సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుంటాడని తెలిసిందే. బాలల దినోత్సవం సందర్భంగా విజయ్దేవరకొండ తీసుకున్న నిర్ణయం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం లివర్ పాంక్రియాస్ ఫౌండేషన్ ఆఫ్ హైదరాబాద్, PACE హాస్పిటల్స్తో కలిసి ఏర్పాటు చేసిన పీరియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవగాహన కార్యక్రమానికి విజయ్దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా విజయ్దేవరకొండ మాట్లాడుతూ.. తన అవయవాలను దానం ( Organ Donation) చేసినట్లు తెలిపాడు. తన మరణానంతరం తాను వేరొకరి జీవితంలో భాగం అయ్యేందుకు ఇష్టపడతానన్నాడు. తన అవయవాలను వృథా చేయడంలో ఎలాంటి ఉపయోగం కూడా లేదన్నాడు. ఇంకొకరి జీవితాన్ని నిలబెట్టాలనే సంకల్పంతో విజయ్ తీసుకున్న ఆర్గాన్ డొనేషన్ నిర్ణయం పట్ల నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఏడాది పాన్ ఇండియా చిత్రం లైగర్తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమాలో నటిస్తున్నాడు. సమంత ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
Read Also : Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పాట ఇదేనట
Read Also : 80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్లో స్టిల్స్
Read Also : Gopichand30 | కోల్కతాలో సూపర్స్టార్ కృష్ణకు గోపీచంద్ 30 టీం నివాళి