Pushpa: The Rise | ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండా పాతిన సినిమా ‘పుష్ప’. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా బాలీవుడ్లో ఈ చిత్రం 100కోట్ల మార్కును అందుకుంది. ఈ చిత్రంలో బన్నీ తన నటన, మేనరిజంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినీప్రముఖుల నుంచి క్రికేటర్లు, రాజకీయ నాయకుల వరకు ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలను రీల్స్లలో తెగవాడుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ పార్టు చిత్రీకరణ జరుపకుంటుంది.
‘పుష్ప’ సినిమా ఎంత హిట్టయిందో అందులో పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘ఊ అంటావా..’ పాట యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. సమంత గ్రేసింగ్ స్టెప్స్, అందాల ఆరబోతకు యూత్ ఫిదా అయ్యారు. అయితే చిత్ర బృందం ముందుగా ఈ పాట కోసం బాలీవుడ్ బ్యాటి దిశాపటానిని సంప్రదించారట. కానీ పటానీ ఈ పాటను చేయడానికి అసహనం వ్యక్తం చేసిందట. దాంతో మేకర్స్ సమంతను సంప్రదించారట. ఇదిలా ఉంటే పుష్ప సెకండ్ పార్టులో కూడా ఊ అంటావా మాదిరి లాగానే స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఈ పాటలో నర్తించడం కోసం మేకర్స్ మళ్లీ దిశాపటానిని సంప్రదించారట. ఊ అంటావా పాటకు వచ్చిన క్రేజ్ చూసి పటాని పార్ట్-2లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టీ మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘పుష్ప’ రూ.365కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఇవి కూడా చదవండి:
N.T.R | ఆ పాటంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టమట!
Prashanth | రెండో పెళ్ళికి సిద్ధమైన సీనియర్ స్టార్ హీరో?
Radhe Shyam | ‘రాధేశ్యామ్’ మరో రికార్డు.. రూ.400కోట్ల క్లబ్లోకి ఎంట్రీ?
Ram Charan-Shankar | మరోసారి రామ్చరణ్కు విలన్గా.. ఆ సీనియర్ స్టార్ హీరో?