Ram Charan-Shankar Movie | మెగా పవర్స్టార్ రామ్చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మర్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో తీరిక లేకుండా గడుపుతన్నారు. ఇక రామ్చరణ్ తన 15వ సినిమాను సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ఆర్’ ప్రమోషన్లలో బిజీగా ఉండటంతో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైలర్ అవుతుంది.
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం పలువురు పేర్లు అనుకున్న.. శంకర్ చివరికి అరవింద స్వామిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి వంటి సినిమాలతో అరవింద స్వామి తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం తర్వాత ధృవ చిత్రంతో తెలుగులో విలన్గా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ధృవ చిత్రంలో చరణ్కు పోటీగా నటిస్తూ స్టైలిష్ విలన్గా క్రిటిక్స్ నుంచి మెప్పుపొందాడు. ఇక వీళ్ళిద్దరు కలిసి మరోసారి తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. నటి అంజలీ, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
Radhe Shyam | ‘రాధేశ్యామ్’ మరో రికార్డు.. రూ.400కోట్ల క్లబ్లోకి ఎంట్రీ?
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’ డైరెక్టర్కు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
Srikanth Meka | విలన్గా బిజీ అవుతున్న సీనియర్ హీరో శ్రీకాంత్