Sagar K Chandra | దర్శకుడు అవ్వాలనే కలతో సొంతంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్ కే చంద్ర. ఇటీవలే ‘భీమ్లానాయక్’ సక్సెస్తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చోటు సంపాదించుకున్నాడు. ‘అయ్యారే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్.. రెండవ సినిమాకు నాలుగేళ్ళు సమయం తీసుకుని ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే కంటెంట్ సినిమాను తెరకెక్కించాడు. శ్రీవిష్ణు, నారారోహిత్ ప్రాధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయింది. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వాత సాగర్చంద్రకు భీమ్లానాయక్ సినిమాను తెరకెక్కించడానికి ఏడేళ్ళు పట్టింది.
ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్ళను సాధించి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర సక్సెస్తో సాగర్ చంద్రకు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈయన భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా కమిటయ్యాడు. ఇదిలా ఉండగానే సాగర్ చంద్ర తాజాగా మరో అగ్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్కు సైన్ చేశాడని సమాచారం. ఈ సంస్థకు అనిల్ సుంకర నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇక సాగర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్లో కూడా ఓ అగ్ర హీరో నటించనున్నట్లు టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్గా విజయ్ దేవరకొండ?
D.V.V Danayya | ఆ యంగ్ డైరెక్టర్తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?
Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?