టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇతర భాషలకు చెందిన హీరోలు బాగా దృష్టి పెడుతున్నారు. ఇన్నాళ్లు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రాలు డబ్ అయి తెలుగులో విడుదల కాగా, ఇప్పుడు ఆయన స్ట్రైట్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా అతి త్వరలోనే మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. ఇక విజయ్ సేతుపతి కూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్.
ఇక ఇప్పుడు స్టార్ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా వీరి బాటలోనే పయనిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బ్యానర్, బిగ్ డైరెక్టరతో కలిసి మూడు భాషలలో ధనుష్ సినిమా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఓ సీనియర్ హీరో కూడా ఇందులో నటించనున్నట్టు టాక్. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. కాగా, ధనుష్ ఇటీవల కర్ణన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ఎంతగానో అలరించింది.