మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 13 : తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన గురువారం మహబూబాబాద్లోని ఇండియన్ బ్యాంక్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంకులో రై తులు, వ్యాపారులు బంగారం తాక ట్టు పెట్టి రుణం తీసుకుని, ఆరు నెలలకోసారి రెన్యువల్ చేస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు తాకట్టు పెట్టిన బంగా రం, లావాదేవీలపైన ఆడిట్ నిర్వహించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.
12 మంది వినియోగదారుల కు సంబంధించిన రూ. 91 లక్షల బం గారం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. అదే బ్యాంకులో తాకట్టు బంగారం పెట్టుకునే ఇన్చార్జి అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ రాజేశ్ తన సొంత అవసరాల కోసం మరో బ్యాంకులో తా కట్టు పెట్టినట్టు గుర్తించారు. దీంతో బంగారం తాకట్టు పెట్టిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ మోతీలాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రఘుపతి రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.