ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తమిళ హీరోల ఫోకస్ అంతా తెలుగు దర్శకులపైనే ఉంది. ఇన్ని రోజులు కేవలం మన హీరోలు మాత్రమే తమిళ దర్శకులతో సినిమాలు చేసేవాళ్ళు. చిరంజీవి నుంచి నాగార్జున, బాలయ్య, వెంకటేష్ సహా మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు సైతం తమిళ దర్శకులకు బాగానే అవకాశాలు ఇచ్చారు. కానీ అదే స్థాయిలో మన దర్శకులకు మాత్రం తమిళ హీరోలు ఛాన్సులు ఇవ్వలేదు.
భాషాభిమానం అడ్డొచ్చిందో లేదంటే నిజంగానే మన దర్శకులను చిన్నచూపు చూసారో తెలియదు కానీ మొన్నటి వరకు కూడా ఇక్కడ దర్శకులతో తమిళ హీరోలు చేసింది అరుదు. మొత్తం అక్కడి దర్శకులతోనే సినిమాలు చేసారు. అయితే రాజమౌళి బాహుబలి చేసిన తర్వాత తెలుగు దర్శకులపై అందరికీ గౌరవం పెరిగిపోయింది. అంచనాలు కూడా పెరిగిపోయాయి.
అందుకే మన దర్శకులు కథలు చెప్పిందే ఆలస్యం అంతా ఓకే అంటున్నారు. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ దర్శకుడు కూడా సైలెంట్ గా ధనుష్ లాంటి మాస్ హీరోను తన కథతో ఒప్పించాడు. తమిళనాడు కేంద్రంగా పక్కా పొలిటికల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు కూడా ధనుష్ కు కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
ఆయనెవరో కాదు.. సాహో దర్శకుడు సుజీత్. చిరంజీవి హీరోగా లూసీఫర్ తెలుగు రీమేక్ తెరకెక్కించే బాధ్యతలు ముందుగా ఈయనకే అప్పగించారు. అయితే అనుభవం పేరుతో ఈయన్ని తప్పించినట్లు వార్తలొచ్చాయి.ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు హీరోలకు కూడా కథలు చెప్పాడు సుజీత్.కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫైనలైజ్ కాలేదు. దాంతో ధనుష్ కు ఓ కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించాలని చూస్తున్నారు. ఎలాగూ ధనుష్ కు బాలీవుడ్ లో కూడా అద్భుతమైన మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి తెలుగు దర్శకులతోనే తన తర్వాతి సినిమాలు చేయబోతున్నాడు ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.
ఇవి కూడా చదవండి..
ఏలియన్స్ పై సినిమా..తాప్సీ గ్రీన్ సిగ్నల్
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్