Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush ). ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించారు. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, ప్రముఖులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది.
ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) కూడా ‘ఆదిపురుష్’పై ట్వీట్ చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘మర్యాద పురుషోత్తముడు ప్రభు శ్రీరామ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షింస్తున్నా. దర్శక నిర్మాతలకు, ఇతర చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.
మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది.
🏹May the #ADIPURUSH Prabhu Shri Ram bless the much awaited film ‘Adipurush’ based on MaryadaPurshottam Prabhu Shri Ram’s life.
Wishing the directors, producers and team #Adipurush a chartbuster success !@manojmuntashir pic.twitter.com/T5xBLBw8MR— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 14, 2023
Also Read..
Uttarakhand | మూడు రోజులుగా.. కుళ్లిన శవాల మధ్యే నవజాత శిశువు
Nitish Kumar | నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. ఫుట్ పాత్ పైకి దూకేసిన సీఎం
Cyclone Biparjoy | ఓవైపు తుపాను.. మరోవైపు భూకంపం.. ఆందోళనలో గుజరాత్ ప్రజలు