75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (75th Cannes Film Festival)లో భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి స్టార్ సెలబ్రిటీలు హాజరైన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్, కమల్హాసన్, మాధవన్ సహా స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే (Deepika Padukone), పూజాహెగ్డే (Pooja Hegde), తమన్నా భాటియా (Tamannah), ఊర్వశి రౌటేలా (Urvashi Rautela), ఇతర సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ భామలంతా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ట్రెండీ కలర్ ఫుల్ కాస్టూమ్స్ లో కెమెరాలకు స్టన్నింగ్ ఫోజులిచ్చి..ఫిలిం ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
భారత జానపద కళాకారుడు, మ్యూజిక్ కంపోజర్ స్వరూప్ ఖాన్ (రాజస్థానీ సింగర్), కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఇండియా ఇన్ పెవీలియన్ ప్రారంభోత్సవంలో ఫేవరేట్ ట్రాక్ ఘూమార్ (Ghoomar) పాట పాడాడు. పాట పాడుతూ ఎదురుగా దీపికా పదుకొనేను డ్యాన్స్ చేయాల్సిందిగా కోరాడు. స్వరూప్ ఖాన్ పాట పాడుతుంటే..దీపికాపదుకొనేతోపాటు పూజాహెగ్డే, తమన్నా, ఊర్వశి రౌటేలా డ్యాన్స్ చేసి..భారతీయ సాంప్రదాయ నృత్యం ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పారు.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ అందాల సుందరీమణులు డ్యాన్స్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈవెంట్లో ఈ భామలంతా హాలీవుడ్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గకుండా సరికొత్త కాస్ట్యూమ్స్ తో తళుక్కున మెరిశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ర్యాంప్ వాక్ చేసి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.