కరోనా వలన డిజిటల్ ప్లాట్ఫాంలకు భారీగా ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పార్క్ అనే పేరుతో ఓటీటీ యాప్ను ప్రముఖ జర్నలిస్ట్ స్వప్ప,బిజినెస్ మెన్ సాగర్తో కలిసి ప్రారంభిస్తున్నారు. మే 15న స్పార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా, మొదట వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీ-కంపెనీ’ స్ట్రీమింగ్ కానుంది.
వర్మ స్టార్ట్ చేస్తున్న స్పార్క్ ఓటీటీకి సెలబ్రిటీల నుండి భారీ మద్దతు లభిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు, పూరి జగన్నాథ్, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్ హీరో రిషితేష్ దేశ్ముఖ్, అందాల భామ అనసూయతో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్పార్క్ ఓటీటీ ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు మరి.