మహేష్ బాబు (Mahesh babu) హీరోగా నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)ట్రైలర్ యూ ట్యూబ్ లో విడుదలైన క్షణం నుంచి సంచలనం సృష్టిస్తోంది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ట్రైలర్ (Sarkaru Vaari Paata Trailer)లో కొన్ని సీన్స్ చూసి మహేష్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా మహేష్ చేయని కొన్ని విషయాలు ఈ ట్రైలర్లో ఎక్కువగా కనిపించాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డబుల్ మీనింగ్ డైలాగులు.
సాధారణంగా మహేష్ బాబు సినిమా అంటే క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. బిజినెస్ మాన్, పోకిరి లాంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని చేశాడు మహేష్ బాబు. ఇప్పుడు సర్కారు వారి పాట కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే వస్తుంది. కాకపోతే ట్రైలర్ లో వినిపించిన కొన్ని డైలాగ్స్ చూసి మహేష్ వీరాభిమానులు కూడా ఇది ఏంటి కొత్తగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నేనున్నాను.. నేను విన్నాను అంటూ పొలిటికల్ సెటైర్ వేశాడు మహేష్.
అప్పట్లో పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్ ఎక్కువగా ఈ మాట వాడాడు. ఇదిలా ఉంటే మనకు పెళ్లీడు వచ్చిందా కిషోర్ అంటూ.. ఆ తర్వాత వచ్చే సీన్ కాస్త డబుల్ మీనింగ్ గా ఉంటుంది. దాంతో పాటు విలన్ గురించి వార్నింగ్ ఇస్తూ మహేష్ వాడే మాట కూడా బూతుకు దారి తీస్తుంది. దానికి తోడు 100 వయాగ్రాలు వేసుకుని శోభనం కోసం వేచి చూస్తున్న పెళ్లి కొడుకు గదిలోకి వచ్చినట్టు అందరూ బలే వచ్చార్రా అంటూ మరో డైలాగ్ కూడా వేశాడు మహేష్.
ట్రైలర్ అంత అదిరిపోయేలా కట్ చేశాడు దర్శకుడు పరశురామ్ (Parasuram). పూర్తిగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైలర్ కట్ చేశారని అర్థమవుతుంది. మొత్తంగా ట్రైలర్ సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. కాకపోతే మధ్యలో వచ్చిన కొన్ని బూతులు మాత్రమే మహేష్ బాబుకు కొత్త. మరి ట్రైలర్ లోనే ఇలా ఉంటే రేపు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.