Prakash Jha on Bollywood | ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అంతగా ఏం బాగోలేదని చెప్పాలి. ఒకవైపు సౌత్ సినిమాల ఆధిపత్యం.. మరోవైపు బాయ్కాట్ ట్రెండ్తో హిందీ సినీ ఇండస్ట్రీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పైగా వాళ్ల సినిమాలు రొటీన్గా ఉంటున్నాయని ప్రేక్షకుల్లో అసంతృప్తి కూడా భారీగానే పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ పరాక్ యాడ్స్తో బిజీగా ఉన్నారని.. వాళ్లకు కథలు వినే సమయం లేదంటూ సీనియర్ డైరెక్టర్ ప్రకాశ్ ఝా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
గంగాజల్, రాజ్నీతి, సత్యాగ్రహ వంటి చిత్రాలతో ప్రకాశ్ ఝా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు చిత్రాలకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన మత్తో కీ సైకిల్ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాశ్ ఝా మాట్లాడారు. స్టార్ హీరోలతో సినిమాలు తీయడం ఎందుకు మానేశారనే ప్రశ్నకు బదులిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ” బాలీవుడ్లోని బడా హీరోలు పాన్ మసాలాలను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. వారికి కథలు వినే అంత తీరిక లేదు. అలాగే వాళ్లు ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్స్ కారణంగా ఎంతమంది ఆరోగ్యం దెబ్బతింటుందో అన్న పట్టి లేదు. ఒక్క యాడ్లో నటిస్తే ఆ రోజు సాయంత్రానికల్లా 50 కోట్లు వారి అకౌంట్లో పడిపోతున్నాయి. ఇక వారికి కథలు వినాల్సి ఆసక్తి ఏముంటుంది. దీనివల్ల కంటెంట్ ఉన్న సినిమాలు ఎందుకు వస్తాయి.” అని ప్రకాశ్ ఝా చెప్పుకొచ్చారు. ఈ కారణంతోనే పెద్ద హీరోలతో సినిమాలు చేయట్లేదని స్పష్టం చేశారు.
సీతారామం సినిమాకు సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ చెప్పిన సమాధానమిదే..