Jacqueline Fernandez | జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి. రూ.200కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో సంబంధాల నేపథ్యంలో పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగుతుండగా.. బాలీవుడ్ బ్యూటీకి సంబంధించిన వార్త వైరల్గా మారింది. సుకేశ్ చంద్రశేఖర్తో పెళ్లికి జాక్వెలిన్ పెళ్లికి సిద్ధమైందని, ఇదే విషయాన్ని బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లకు సుకేష్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు జాక్వెలిన్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ ఇద్దరు నటులు సుకేశ్తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన బృందంలోని సీనియర్ పోలీస్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. నటులు ఇచ్చిన సలహాలు, సూచనలను పట్టించుకోకుండా.. సుకేశ్తో జాక్వెలిన్ సంబంధాలు కొనసాగించిందని, ఖరీదైన బహుమతులు తీసుకుందని ఆ అధికారి పేర్కొన్నారు. లంకన్ బ్యూటీ మేనేజర్ ప్రశాంత్ను ఆకట్టుకునేందుకు సుకేశ్ డుకాటీ బైక్ను గిఫ్ట్గా ఇచ్చాడని అధికారి తెలిపారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్ నేర చరిత్రను విస్మరించిందని, సుకేష్తో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లుగా పేర్కొన్నారు. జాక్వెలిన్ మాత్రమే కాదు.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఆర్థికంగా లబ్ధి పొందినట్లుగా ఈడీ పేర్కొంది. రూ. 215 కోట్ల దోపిడీకి పాల్పడ్డట్లుగా సుకేశ్ చంద్రశేఖర్పై ఆరోపణలున్న విషయం తెలిసిందే. కేసు విచారణలో జాక్వెలిన్కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇచ్చాడని తేలింది. ఆ తర్వాత ఈడీ రూ.7 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. సుకేశ్ చంద్రశేఖర్.. పింకీ ఇరానీ ద్వారా జాక్వెలిన్కు ఖరీదైన బహుమతులు, నగదును అందించినట్లుగా ఆరోపణలున్నాయి.