బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) లాంగ్ గ్యాప్ తర్వాత లాల్ సింగ్ ఛద్దా (Laal Singh Chaddha) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టును అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అమీర్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.ఈ సినిమా 1994 బ్లాక్ బాస్టర్ హిట్ హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్కు రీమేక్గా వస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది టీం.
తాజాగా ముంబై సర్కిల్ నుంచి ఓ వార్త తెరపైకి వచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో సినిమా టికెట్ల ధరలను పెంచాలని (Ticket prices) అమీర్ ఖాన్ డిస్ట్రిబ్యూటర్లకు సూచించాడట. ఇటీవలే కాలంలో చాలా వరకు హిందీ చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాలని ఆశిస్తున్న అమీర్ ఖాన్..ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు విజ్ఞప్తి చేశాడని టాక్ నడుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే మరి ఈ స్టార్ హీరో రిక్వెస్ట్ ను డిస్ట్రిబ్యూటర్లు పరిగణనలోకి తీసుకుంటారా..? లేదా..? అన్నది చూడాలంటున్నారు సినీ జనాలు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు టికెట్ ధరలు పెంచితే థియేటర్లకు వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. హిందీ సినిమాల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండగా..మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.