సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఏదో ఒక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ (Telugu cinema) నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh). గతంలో ఎన్నికల సమయంలో పాలిటిక్స్ లో యాక్టివ్గా కనిపించిన బండ్ల గణేశ్ కొంతకాలంగా దూరాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కట్ చేస్తే..ఇపుడు అందరికీ షాకిస్తూ చేసిన ఓ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటనే కదా మీ డౌటు. బండ్ల గణేశ్లోని పొలిటీషియన్ మళ్లీ తెరపైకి వచ్చినట్టు ఈ స్టిల్ చూస్తే అర్థమవుమవుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎంగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు శుభాకాంక్షలు తెలుపుతూ..ఆయనతో దిగిన ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. యూపీకి రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న యోగిఆదిత్యానాథ్జీకి ఆల్ ది బెస్ట్. పరమేశ్వరుడు ఆయనకు ఆయురారోగ్యాలు, ఆనందాన్ని అందించాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు బండ్ల గణేశ్.
Wishing Shri.Yogi Adityanath ji the very best as he takes office as Chief Minister of #UttarPradesh for the second time. May Lord Parameswara bless him with good health & happiness. @myogiadityanath @CMOfficeUP @UPGovt #YogiAdityanath #UttarPradeshElections pic.twitter.com/WLb2fvAJb5
— BANDLA GANESH. (@ganeshbandla) March 26, 2022
సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో యాక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్రేజీ అంకుల్స్ లో నటించగా..ఇటీవలే మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియాలో కూడా మెరిశారు బండ్ల గణేశ్. చాలా కాలం తర్వాత యూపీ సీఎంను కలిసి విషెస్ చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.