Krishnamma Movie | టాలీవుడ్ హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండగా.. వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున్న నిర్వహించారు మేకర్స్.
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని వచ్చి సందడి చేశారు. అయితే ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సత్యదేవ్ చిన్న చిన్న పాత్రలతో కెరీర్ని ప్రారంభించి.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ కథకైనా, పాత్రకైనా సత్యదేవ్ న్యాయం చేయగలుగుతాడు. అయితే ఈ మధ్య ప్రేక్షకుల సినిమాలు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు రెండు రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రండి. క్రికెట్ స్కోర్ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు అని అనిల్ తెలిపాడు. దీంతో అనిల్ వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
#IPL జరుగుతుంది అని సినిమాలని పక్కన పెట్టకండి😂
Director #AnilRavipudi hilarious speech at #Krishnamma GRAND PRE-RELEASE EVENT 🤩🔥#ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/Vps5s0ThJ5
— Shreyas Media (@shreyasgroup) May 1, 2024
అతిరా రాజీ ‘కృష్ణమ్మ’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా. ఈ ముగ్గురికి ఓ విలన్కు మధ్య జరిగే గొడవే ‘కృష్ణమ్మ’. వీరి మధ్య జరిగిన ఓ ఘటన వారి ముగ్గురి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.