Balakrishna | టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలతో సరిపెట్టుకోవడం లేదు. తమ మార్కెట్ పెరిగింది అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఆగిపోవడం కంటే నేరం మరొకటి లేదు అని ఫీల్ అవుతున్నారు మన హీరోలు. అందుకే పాన్ ఇండియా కథలు ఎంచుకొని తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కు వెళ్లి ప్రభాస్, అల్లు అర్జున్ తమ సత్తా చూపించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్లో జెండా పాతడం ఖాయం. ఎందుకంటే వాళ్లతో రాజమౌళి అస్త్రం ఉంది. దాంతో ఇప్పుడు మిగిలిన హీరోలు కూడా పాన్ ఇండియా దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడు.
అఖండ సినిమాతో ఈమధ్య ఫామ్లోకి వచ్చాడు బాలయ్య. ఈ సినిమా దాదాపు రూ.70 కోట్ల షేర్ వసూలు చేసింది. పుష్ప సినిమా జోరు తట్టుకొని మరీ సంచలన విజయం సాధించింది అఖండ. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు.. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. కథ కూడా అలాగే ఉండేలా గోపీచంద్ మలినేని కసరత్తులు చేస్తున్నాడు. వేటపాలెం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. క్రాక్ తర్వాత మరోసారి పోలీస్ కథనే నమ్ముకున్నాడు గోపీచంద్ మలినేని. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. దీని కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తుంది మైత్రి మూవీ మేకర్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !
Akhanda | అఖండ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ .. డిస్నీ హాట్స్టార్లో గర్జించేది అప్పుడే
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
Satyaraj | కట్టప్పకు కరోనా.. చెన్నైలో ట్రీట్మెంట్