చెన్నై : దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ ప్రపంచ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా ప్రముఖ నటి త్రిషకు కరోనా సోకింది. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వైరస్ బారినపడ్డట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం కొవిడ్ లక్షణాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని, మహమ్మరి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది.
తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకిందని చెప్పింది. కరోనా అన్ని లక్షణాలు నాకున్నాయి. నాకు ఆ వారం అంతా చాలా బాధ కలిగించిందని తెలిపింది. ప్రస్తుతానికి నేను కోలుకున్నాని, వ్యాక్సిన్ వేయించుకున్నాను కాబట్టే నేను బాగున్నానన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్క్ ధరించాలని సూచించింది. తన కోసం ప్రార్థించిన బంధుమిత్రులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
ఇదిలా ఉండగా త్రిష గత కొన్ని నెలలుగా వెబ్ సిరీస్ ‘బృందా’ షూటింగ్లో ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు త్రిష న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఓ ప్రాంతానికి వెళ్లగా.. దురదృష్టవశాత్తు అక్కడ కొవిడ్ పాజిటివ్గా తేలడంతో ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నది. ఈ సందర్భంగా కొవిడ్తో ఎదురైన ఇబ్బందులను శుక్రవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది.