వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్
ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయాలి
జిల్లాలో హెల్త్ టీం యాక్టివ్గా ఉండాలి : కలెక్టర్ హరిత
చెన్నారావుపేట, ఏప్రిల్ 6: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయ న హైదరాబాద్ నుంచి కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, నివారణ చర్యలపై కలెక్టర్, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అ నంతరం కలెక్టర్ హరిత కొవిడ్ నివారణ కోసం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి వ్యాధి లక్షణాలున్నా వెంటనే వారికి రాపిడ్ యాంటిజెన్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్నారు. ప్రతి పీహెచ్సీలో 65, సీహెచ్సీలో 75(50-ఆర్టీపీసీఆర్) పరీక్షలు చేయాలని లక్ష్యాలను నిర్దేశించారు. టెస్టుల్లో పాజిటివ్ కేసులు నమోదైతే వారికి వెంటనే చికిత్స అందించి హోం ఐసొలేషన్ చేస్తూ క్లోజ్ కాంటాక్ట్లకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు సమూహాలుగా ఉండకుండా సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. జిల్లాలో హెల్త్ టీం యాక్టివ్గా ఉండి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రావుల మహేందర్రెడ్డి, అదనపు కలెక్టర్(లోకల్ బాడీ) భూక్యా హరిసింగ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, డీఆర్డీవో పీడీ ఎం సంపత్రావు, డీసీపీ వెంకటలక్ష్మి, జడ్పీ సీఈవో రాజారావు, డీపీవో చంద్రమౌళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
బీజేపీ గెలుపు యంత్రం కాదు.. ప్రజల్లో ఒక చైతన్యం: ప్రధాని మోదీ