సాధారణంగా హీరోయిన్లు సినిమాలు, ఫొటో షూట్స్ , ఇతర వృత్తిపరమైన కమిట్ మెంట్స్తో బిజీగా ఉంటుంటారు. అయితే హీరోయిన్లు ప్రొఫెషనల్ కెరీర్ను కొనసాగిస్తున్న క్రమంలో ఒక్కోసారి కొందరు కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ల చేతిలో ఇరుక్కొని, ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి ఘటనే ఒకటి బాలీవుడ్ నటి రిమీ సేన్ (Rimi Sen) విషయంలో జరిగిందన్న వార్త ఇపుడు బీటౌన్ తోపాటు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
రిమీ సేన్ను రౌనక్ వ్యాస్ (Raunak Vyas) అనే వ్యాపారవేత్త ప్రాపర్టీ (property) కొనుగోలు పేరుతో భారీ మొత్తంలో మోసానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం సదరు వ్యాపారవేత్త రిమీ సేన్ పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేస్తానని చెప్పి…ఆమె దగ్గరి నుంచి రూ.4.14 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని రిమీ సేన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 2019లో రిమీ సేన్ మొదటి రోనక్ వ్యాస్ ను ఓ జిమ్ లో కలిసింది. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులు.
అయితే పెట్టుబడి మొత్తంపై 30 నుంచి 40 శాతం రాబడి వస్తుందని రోనక్ వ్యాస్ తనను నమ్మించి..మోసానికి పాల్పడినట్టు రిమీ సేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు టాక్. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరికొంత కాలం వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, నీ తోడు కావాలి, అందరివాడు (Andarivadu Heroine)సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది రిమీ సేన్. చిరంజీవితో చేసిన అందరివాడు రిమీసేన్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.