కమలం అతి పెద్ద దోపిడీ పార్టీ: మమత
ఖరగ్పూర్: బయటివాళ్లను బెంగాల్లోకి రానివ్వద్దంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొడుతూ.. బీజేపీ డీఎన్ఏలో బెంగాల్ ఉందని వ్యాఖ్యానించారు. మోదీ శనివారం ఖరగ్పూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘బెంగాల్కు చెందిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ ఒక్కటే. బీజేపీ మాతృసంస్థ జన్సంఘ్ను స్థాపించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్ భూమిపుత్రుడే. బెంగాల్ రాష్ట్రం బీజేపీ డీఎన్ఏలోనే ఉంది’ అని మోదీ అన్నారు. మరోవైపు, మమత హల్దియాలో జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పార్టీ బీజేపీ అని ఆరోపించారు.