Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక తిరుపతిలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.. వరదల కారణంగా ఆ రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ మెగా నిర్మాత అల్లు అరవింద్ ముందుకొచ్చారు.
ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. అందులోనూ మెగా నిర్మాత అల్లు అరవింద్ తన వంతు సహాయం ఎప్పుడూ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వాళ్లకు తనవంతు సహాయంగా.. గీతా ఆర్ట్స్ తరఫున 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఏపీలో వరదలు బాధాకరమని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెద్ద సినిమాలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థకు ఓటు..
RRR నిర్మాతలకు ఊహించని షాక్.. వందల కోట్లు వచ్చేదెలా..?
అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?