విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించిన లైగర్ (Liger) బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. దీంతో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అయిన ఛార్మి (Charmee Kaur), పూరీ జగన్నాథ్పై నెట్టింట నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛార్మీ సోషల్ మీడియా (social media) నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేసింది..హోం బ్యానర్ పూరీ కనెక్ట్స్ మళ్లీ సక్సెస్ అందుకుంటుందని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేసింది.
అయితే నెటిజన్లు మాత్రం ట్రోల్స్ వల్లే ఛార్మీ సోషల్ మీడియాకు దూరమైందంటూ పుకార్లు ఊపందుకున్నాయి. కొన్ని రోజులుగా నెట్టింట వస్తున్న ట్రోల్స్ ఛార్మీకి తలనొప్పిగా మారాయి. తాజాగా వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ మరో ట్వీట్ చేసింది ఛార్మీ. పుకార్లు..పుకార్లు..పుకార్లన్నీ వట్టివే…కేవలం పూరీ కనెక్ట్స్ (Puri connects) పనులపై ఫోకస్ పెడుతున్నా. RIP రూమర్స్ అంటూ ట్వీట్ చేసింది.
లైగర్ ఫలితం తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్, ఛార్మీ జనగణమన బడ్జెట్ గురించి చర్చించిన అనంతరం సినిమాను నిలిపేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. మొరాకో షెడ్యూల్ను మొదలుపెట్టాల్సి ఉండగా..లైగర్ కారణంగా సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. మరి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాతనైనా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారా..? లేదా..? అన్నది చూడాలంటున్నారు సినీ జనాలు.
Rumours rumours rumours!
All rumours are fake!
Just focusing on the progress of 𝐏𝐂 ..
Meanwhile, RIP rumours !!— Charmme Kaur (@Charmmeofficial) September 8, 2022
Read Also : Hari Hara Veera Mallu | క్రిష్ సినిమాపై ఫోకస్..డేట్స్ కూడా ఇచ్చేసిన పవన్..!