Falcon Scam | ఫాల్కన్ స్కామ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఎండీ అమర్దీప్ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
డిపాజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లు, ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ మార్కెట్లలో అధిక లాబాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి భారీ మొత్తంలో నగదు కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే అమర్దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కు పరారయ్యాడు. దీంతో అమర్దీప్పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి సమాచారం అందించడంతో.. తెలంగాణ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.