మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మల్టీస్టారర్గా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. చెన్నైలో జరిగిన ఈవెంట్లో ట్రైలర్ను లాంఛ్ చేశారు రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్. ఈ ఈవెంట్లో రజినీకాంత్ చేసిన కామెంట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
(Narasimha) పడయప్ప (నరసింహ) చిత్రానికి పొన్నియన్ సెల్వన్ నవలలోని నందిని పాత్రకు సారుపత్య ఉందని చెప్పాడు రజినీకాంత్. పొన్నియన్ సెల్వన్-1లో ఐశ్వర్యారాయ్ పోషించిన నందిని పాత్రను స్పూర్తిగా తీసుకుని నరసింహ చిత్రంలోని రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను సృష్టించడం జరిగిందని తెలిపాడు. నీలాంబరి పాత్ర తెలుగు, తమిళ ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తిండిపోవడమే కాదు..రమ్యకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ బెస్ట్ రోల్గా నిలిచింది.
రజినీకాంత్ కామెంట్స్తో మరి పీఎస్-1లో ఐశ్వర్యారాయ్ పాత్ర కూడా అంతే స్ట్రాంగ్గా ఉండబోతుందా..? అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు. రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు. రమ్యకృష్ణ కీ రోల్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
Read Also : Bigg Boss 6 Nominations | నామినేషన్స్ లో ఎలిమినేట్ అయ్యేదెవరు..? ప్రోమో