పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) రీసెంట్గా తెరకెక్కించిన లైగర్ (liger) బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విజయ్ దేవరకొండతోపాటు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఛార్మీ, పూరీ ఇతర టీం మెంబర్స్ కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. కాగా ఈ సినిమా ఎఫెక్ట్ వల్లేనా..కాదా..? తెలియదు కానీ పూరీ, విజయ్ కాంబినేషన్ లో రాబోతున్న జనగణమన ప్రస్తుతానికి అటకెక్కినట్టేనని వార్తలు బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
ఇక విజయ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఖుషీ సినిమా చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నాడట. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ నెక్ట్స్ యువ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరనే కదా మీ డౌటు. ఇంకెవరో కాదు..పూరీ కుమారుడు ఆకాశ్ (Akash Puri). అవును తన నెక్ట్స్ సినిమాను ఆకాశ్తో తీసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు హాట్ టాపిక్గా మారాయి.
ఇదే నిజమైతే కొడుకును ఎలాంటి స్టోరీతో సిల్వర్ స్క్రీన్పై చూపిస్తాడని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. రీసెంట్గా ఆకాశ్ పూరీ హీరోగా వచ్చిన ఓ సినిమా ఈవెంట్లో నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ..ఎందరో హీరోలను స్టార్ హీరోలను చేసిన జగనన్న ఆకాశ్ను స్టార్ చేయడంపై ఫోకస్ పెట్టాలంటూ స్టేజ్పై చెప్పిన మాటలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేశాయి.
లైగర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పూరీజగన్నాథ్ ఈవెంట్కు రాలేకపోయాడని తెలిసిందే. ఎంతో కష్టపడి చేసిన లైగర్ బోల్తా కొట్టడంతో పూరీజగన్నాథ్ ఇక కొడుకును ప్రమోట్ చేసే పనిపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడా..? అంటూ అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.