Akshay Kumar | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar ) కేదార్నాథ్ ( Kedarnath ) ఆలయాన్ని సందర్శించారు. భారీ భద్రత నడుమ మంగళవారం ఆలయానికి చేరుకున్న అక్షయ్ కుమార్.. స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘బడేమియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వసూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. వచ్చే ఏడాది వేసవికి హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు మరికొన్ని బాలీవుడ్ చిత్రాల్లో అక్షయ్ నటిస్తున్నారు.
Also Read..
Sudha Murthy | 30 ఏళ్లుగా ఒక్క వెకేషన్కు కూడా వెళ్లలేదు : సుధామూర్తి
Virat Kohli | మరింత దృఢంగా తిరిగొస్తాం.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిష్క్రమణపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
Jeff Bezos | ప్రియురాలు లారెన్తో జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్..?