Virat Kohli | ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ఏడాది ఐపీఎల్ 2023 (IPL 2023) నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) చేతిలో ఓటమి పాలైంది. రన్మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన జట్టు ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించడంపై కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు.
‘ఈ సీజన్ ఎన్నో మధుర క్షణాలను అందించింది. కానీ, దురదృష్టవశాత్తు మేము లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాం. నిరాశ చెందాము. మాకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. అడుగడుగునా అండగా నిలిచిన కోచ్లు, మేనేజ్మెంట్, నా సహచర ఆటగాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మేం మరింత దృఢంగా తిరిగి వస్తాం’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, గత మ్యాచ్లో సూపర్ విక్టరీతో ఆశలు రేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. చివరి మ్యాచ్లో ఓటమితో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ చేతిలో ఓటిపాలైంది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుచేసింది. దీంతో ఈ సీజన్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది.
Also Read..
Jeff Bezos | ప్రియురాలు లారెన్తో జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్..?
India Corona | 24 గంటల్లో 400 కొత్త కేసులు.. నలుగురు మృతి
Rahul Gandhi | లారీలో రాహుల్.. వారి సమస్యలను తెలుసుకునేందుకేనట..!