ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా నాగార్జున స్పందించారు. తాను విజయవాడ ఎంపీ (Vijayawada Mp Seat)గా పోటీ చేస్తానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి తాను పోటీచేస్తానని వార్తలు వస్తున్నాయని, తాను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు .
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా. మంచి కథ దొరికితే రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తానని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. నాగార్జునను విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా పోటీలో దింపేందుకు వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తుందంటూ వార్తలు రాగా..పొలిటికల్ ఎంట్రీ అప్డేట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తాజాగా నాగార్జున ఇచ్చిన రియాక్షన్తో తేలిపోయింది.
ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షోతోపాటు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో
నాగార్జున టైటిల్ రోల్ చేస్తున్న ది ఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. మరోవైపు పలు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి.
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Read Also :Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్