సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 20 : కరోనా నియంత్రణ కోసం ప్రభు త్వం జారీ చేసిన నిబంధనలను అతిక్రమిస్తే కేసులు తప్పవని సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న నేపథ్యంలో నిబంధనలపై పోలీస్స్టేషన్ పరిధిలో ఆయన ఆటోల్లో మైక్ల ద్వారా ప్రచారం చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో తిరుగుతూ మాస్కులు ధరించని వారిని గుర్తించి జరిమానా విధించారు. ఇటీవల మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 360 మందికి జరిమానాలు విధించినట్లు చెప్పారు. నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.
బెల్లంపల్లిటౌన్, ఏప్రిల్ 20 : కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన నైట్ కర్ఫ్యూకు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత కోరారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వచ్చేనెల 1 వరకు ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపారు.
గర్మిళ్ల, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూకు మంచిర్యాల పట్టణ ప్రజలు సహకరించాలని మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా మెడికల్ షాప్లు, హాస్పిటళ్లు, ల్యాబ్లు, పెట్రోల్బంక్లు మినహా ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ భారతీయ శిక్షా స్మృతి కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
వేమనపల్లి, ఏప్రిల్ 20 : మండలంలోని గెర్రెగూడెం గ్రామంలో కరోనా నియంత్రణ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ముఖానికి మాస్కులను ధరించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు శ్రావణ్కుమార్, లచ్చన్న, మురళీ, పోశం, శ్రీనివాస్, రమేశ్, ప్రజలు పాల్గొన్నారు.