సమ్మోహనం, వి సినిమాల తర్వాత మహాసముద్రం (Maha Samudram) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలుకరించేందుకు రెడీ అవుతోంది హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితీరావు హైదరి (Aditi Rao Hydari) . అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహాసముద్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది అదితీరావు హైదరి. ఈ (Tollywood) బ్యూటీ పాపులర్ లెజెండ్ బయోపిక్ లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.
ప్రముఖ లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbalakshmi) బయోపిక్ లో నటించాలన ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు అదితీరావుకు సరైన హిట్ పడలేదు. దీంతో మహాసముద్రం చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. తన కెరీర్కు మహాసముద్రం బాసటగా నిలుస్తుందని ధీమాతో ఉంది అదితీరావు. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ను ఇండస్ట్రీకి అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మహాసముద్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే ఇడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా అనూఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు