హైదరాబాద్ : నటుడు సాయిధరమ్ తేజ్ ( Saidharam Tej ) స్పృహలోకి వచ్చాడు. నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి వద్ద బైక్పై వెళ్తున్న సాయిధరమ్ తేజ్ కింద పడిపోవడంతో.. అతని ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. దీంతో అతన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం సాయిధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. స్పృహలోకి వచ్చిన సాయి ఒకే ఒక మాట మాట్లాడినట్లు తెలుస్తోంది. నొప్పిగా ఉందని సాయి చెప్పినట్లు సమాచారం. సాయిధరమ్ తేజ్కు డాక్టర్ అలోక్ రంజన్ బృందం చికిత్స అందిస్తోంది.
ఇవి కూడా చదవండి..
NTR: సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన ఎన్టీఆర్
Health Bulletin: సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్.. !
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Sai Dharam Tej: సాయి తేజ్పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Sai dharam Tej: ప్రమాదం సమయంలో సాయి తేజ్ వాడిన బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?