మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రమాదం సమయంలో తేజ్ రైడ్ చేసిన బండి నెంబర్ TS07 GJ1258. చూడగానే ఆకట్టుకునే మోడల్ తో ఉన్న రేసింగ్ బైక్ దాదాపు 228 కేజీల బరువు ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటాక ఐకియా వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు.
సీసీఫుటేజ్ ఆధారంగా జరిగిన ప్రమాదాన్ని నిర్దారించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 336, 180 ఎంవీ.. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు కేసు ఫైల్ చేశారు. అయితే ఈ బైక్ అనిల్ కుమార్ బుర్రా అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయి ఉండగా, 2020 ఆగస్టు 2న ఓవర్ స్పీడ్ కారణంగా ఈ బైక్ కు చలానా పడింది. అయినప్పటికీ తేజ్ తన స్పీడ్ వేగాన్ని తగ్గించలేదు.
ప్రమాదం సమయంలో తేజ్ 120 కి.మీ స్పీడ్తో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఇప్పుడు తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచున్నారు. మరి కొద్ది నిమిషాలలో తేజ్ హెల్త్కి సంబంధించి మరో హెల్త్ బులిటెన్ రానుంది.