మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జిపై కింద పడ్డ విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సమయంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయింది. దీంతో తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు అయ్యాయి. షోల్డర్ బోన్ విరిగినట్టు తెలుస్తుంది. బాడీలో ఎక్కడ బ్లీడింగ్ జరగలేదని, అవయవాలేవి కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదని వైద్యులు అంటున్నారు.
తేజూకి ప్రస్తుతం అపోలోలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తేజ్ బండి స్కిడ్ కావడానికి కారణం అక్కడ అక్కడ మట్టి, బురద ఉండటం వల్లనే అని అంటున్నారు. తేజ్ ఈ బైక్ని రీసెంట్గా కొనుగోలు చేశారు. తేజ్ బండి నెంబర్ TS07 GJ1258. ఆ బైక్ ఖరీదు రూ.18లక్షలు. అనిల్ కుమార్ పేరుతో బైక్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్. ఇది సరికొత్త బైక్. హై ఎండ్ బైక్ అని చెప్పాలి. దీని బరువు 228 కేజీల వరకు ఉంటంది.
బైక్ రైడింగ్ అంటే తేజ్కి చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. శుక్రవారం కూడా అదే క్రమంలో వెళుతున్న క్రమంలో ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం సమయంలో అతను హెల్మెట్ ధరించడం వలన పెద్ద ప్రమాదం తప్పింది.