Indian Dies : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబూధాబీలో క్షిపణి శకలాలు(Missile Debris) మీద పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఒకరు భారతదేశ పౌరుడుగా మరొకరిని పాకిస్థాన్ దేశస్థుడిగా గుర్తించారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నాలుగు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. క్షిపణుల దాడుల కారణంగా గురువారం భారత పౌరుడు సహా పాకిస్థాన్ దేశస్థుడు ప్రాణాలు కోల్పోయారు. అబూధాబీపై ఇరాన్ జరిపిన క్షిపణుల దాడి సమయంలో వాటి శకలాలు తగలడంతో వీరిద్దరూ మృతి చెందారని జోర్డాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రమాదాన్ని జోర్డాన్ తీవ్రంగా ఖండించింది.

‘సోదర దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ దాడులను జోర్డాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడి ఫలితంగా భారత్, పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జోర్డాన్ పౌరుడు ఒకరు గాయపడగా.. ఎమిరేట్స్కు చెందిన ఒకరు, మరో భారతీయుడు గాయపడ్డారు. ఇలాంటి క్రూరమైన దాడులను జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. యూఏఈ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం, ఆ ప్రాంతంలో సుస్థిరతను నాశనం చేసే చర్యలుగా పరిణగిస్తున్నాం. ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈకి మా సానుభూతి తెలియజేస్తున్నాం. క్షిపణి శకలాలు తగిలి మృతి చెందినవారికి సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని జోర్డాన్ విదేశాంగ శాఖ ఎక్స్లో పేర్కొంది.