ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెకానికల్ లైఫ్ అనే పదానికి ప్రత్యక్ష నిదర్శనంలా చాలా మంది బతుకుతున్నారు. కనీసం ఒక్క పూట కూడా కుటుంబంతో గడపలేనంతగా బిజీ అయిపోతున్నారు. ఇలాంటి బిజీ లైఫ్ వద్దని అనుకున్న ఒక నటుడు.. తన కెరీర్ను వదిలేసి సొంతూరికి వెళ్లిపోయాడు. అక్కడే ఆవులు కాసుకుంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు.
ఇప్పటికే ఎంఎస్ ధోని, పవన్ కళ్యాణ్, ప్రకాశ్రాజ్.. ఇలా చాలా మంది సెలబ్రెటీలు వ్యవసాయం చేస్తున్నారు. అయితే వాళ్లు ప్రొఫెషన్ కొనసాగిస్తూ ఖాళీ సమయాల్లో పొలం పనుల్లో గడిపేస్తున్నారు.కానీ ఆశిష్ శర్మ అనే నటుడు మాత్రం పూర్తిగా తన కెరీర్ను వదిలేసి.. రాజస్థాన్లోని తన సొంతూరిలో 40 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. అలాగే 40 ఆవులను కూడా తీసుకుని పాల వ్యాపారం చేస్తూ అక్కడే సెటిలైపోయాడు. కరోనా వైరస్కు మందు తన జీవితం మరోలా ఉండేదని.. అయితే లాక్డౌన్ సమయంలో తాను ఏం కోల్పోతున్నానో తనకు అర్థం అయింది అంటున్నాడు ఆశిష్ శర్మ. అందుకే సినిమాలు వదిలేసి హాయిగా ఊర్లో వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్తున్నాడు. ప్రకృతికి దగ్గరగా ఉంటే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంది అంటున్నాడు.
ఇప్పటినుంచి తన జీవితాన్ని పూర్తిగా సేద్యానికి అంకితం చేస్తానని అంటున్నాడు ఆశిష్. తాను వ్యవసాయం చేయడం వల్ల తన ఊరిలో చాలా మందికి ఉపాధి దొరుకుతుందని.. అందుకే ఇకపై తన జీవితం మీదే అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా సమయం కేటాయించలేని జీవితం తనకు అవసరం లేదు అంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
రాజమౌళి ‘బజరంగీ భాయ్జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?