అర్జున్ సోమయాజులు, అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’ . ఈ మూవీ నుంచి ‘ఆమని ఉంటే’ తొలి పాటను ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్డే ట్విటర్ ద్వారా లాంఛ్ చేసింది. రాములో రాములా పాటతోపాటు మరెన్నో సాంగ్స్ తో సంగీత ప్రపంచాన్ని షేక్ చేస్తున్న అనురాగ్ కులకర్ణి ఈ పాట పాడగా.. కృష్ణకాంత్ పాటను రాశాడు. ‘ఆమని ఉంటే పక్కనా..ఏమని చెప్పను భావన’ అంటూ సాగుతున్న ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
కన్నడ బ్లాక్ బాస్టర్ రొమాంటిక్ ప్రాజెక్టు దియాకు రీమేక్గా ‘డియర్ మేఘ’ వస్తోంది. సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పై అర్జున్ దస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన డియర్ మేఘ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. మేకర్స్ త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!