పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ వస్తోన్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో భారీ మార్పు చేసినట్టు ఓ న్యూస్ ఫిలింనగర్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట. ఆయన స్థానంలో ప్రముఖ బాలీవుడ్ అండ్ సౌత్ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ప్రసాద్ మూరెళ్ల టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ. ఆయన పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది, కాటమరాయుడు చిత్రాలకు పనిచేశారు. అయితే ఇలా సడెన్ గా పవన్-రానా మల్టీస్టారర్ నుంచి ప్రసాద్ మూరెళ్ల తప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రవి కే చంద్రన్ ఇప్పటికే మహేశ్ బాబుతో భరత్ అనే నేను చిత్రానికి పనిచేశాడు. తాజా మల్టీస్టారర్ ఆయనకు తెలుగులో రెండో సినిమా కాబోతుంది.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!