ట్రెండ్ మారింది..ఇపుడంతా డిజిటల్ ప్లాట్ ఫాం (OTT platforms)ల హవా నడుస్తుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతంలో సినిమాలు థియేటర్ల(Theatres)లో లాంగ్ రన్ పీరియడ్ పూర్తయ్యాక..ఎప్పుడో కానీ టీవీలోకి వచ్చేవి. అయితే కోవిడ్ ప్రభావంతో మార్కెట్లోకి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఇటు థియేటర్కు, అటు టీవీకి మధ్య ఉన్న స్పేస్ను మార్కెట్ చేసుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాయి.
కానీ ఈ పరిస్థితులు ఓటీటీ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతున్నప్పటికీ, థియేటర్ల వ్యవస్థపై మాత్రం ప్రభావం చూపిస్తున్నాయనేది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. సినిమా థియేట్రికల్ రిలీజ్తోపాటు ఓటీటీ విడుదల తేదీలు కూడా తక్కువ టైంలోనే ప్రకటించడంతో..ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పక్కా కమర్షియల్ ఈవెంట్లో అన్నారు నిర్మాత బన్నీ వాసు. ఈ పద్దతి హీరోల మార్కెట్కు అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ (Tollywood) పెద్దలు 50 వే విండో (50 Day Window)మెథడ్ను తప్పనిసరి చేసే విషయమే సమాలోచనలు చేస్తున్నట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. థ్రియేట్రికల్ రిలీజ్కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్కు మధ్య 50 రోజుల గ్యాప్ తప్పనిసరి అనే నిబంధనను ఫైనల్ చేసేందుకు రేపు టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హడావిడికి కళ్లెం పడటం ఖాయమైనట్టేనంటున్నారు సినీజనాలు.