టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. SSMB 28 వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవనున్నట్టు తాజా టాక్. కాగా మేకర్స్ ఈ సినిమా కోసం పవర్ ఫుల్ విలన్ను వెతికే పనిలో పడ్డారట. లేటెస్ట్ టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోను విలన్గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడని వార్త హల్ చల్ చేస్తోంది. తారకరత్న కీ రోల్ చేస్తాడని వార్తలు రాగా..అది వాస్తవం కాదని పీఆర్ టీం వెల్లడించింది.
అయితే తాజాగా స్టార్ హీరోలు విజయ్సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), పృథ్విరాజ్ సుకుమారన్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని చర్చ నడుస్తోంది. విజయ్ సేతుపతి ఇప్పటికే ఉప్పెనలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు. ఇక ఫహద్ ఫాసిల్ పుష్ప చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్గా నటించి మెప్పించాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా సినిమాపై హైప్ క్రియేట్ అవడం గ్యారంటీ అంటున్నారు సినీ జనాలు.
ఇక మలయాళంలో మంచి యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన పృథ్విరాజ్ సుకుమారన్ మాత్రం ఇప్పటివరకు తెలుగులో సినిమా చేయలేదు. సాధారణంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు దూరంగా ఉంటాడు పృథ్విరాజ్ సుకుమారన్. మరి మహేశ్ సినిమాను ఓకే చేస్తాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.