టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పరశురాం (Parasuram) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో కీర్తిసురేశ్ (Keerthy Suresh) హీరోయిన్గా నటించింది. మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ఈ క్రేజీ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా ఈ చిత్రం చూసేందుకు సోషల్ మీడియాలో చురుకుగా ఓ వ్యాపారవేత్త చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నాడట. ఇదే విషయాన్ని ట్వీట్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ బిజినెస్ మెన్ ఎవరనేది గుర్తొచ్చిందా..? ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్తో నెటిజన్లను ఆకట్టుకునే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). మరి సర్కారు వారి పాట సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూడటానికి కారణమేంటనుకుంటున్నారా..? ఈ చిత్రంలో మహేశ్ బాబు ఉపయోగించిన జావా మెరూన్ బైక్ (Jawa Maroon bike). అవును మహీంద్ర గ్రూప్కు సంబంధించిన క్లాసిక్ లెజెండ్స్ ఈ బైకును తయారు చేసింది.
అనుపమ్ తనేజా పోస్ట్ చేసిన ఈ సినిమాలోని బైకు సీన్ వీడియో ట్యాగ్ చేస్తూ.. మహేష్ బాబు, జావా అద్బుతమైన, ఊహించని కలయికను చూడకుండా ఎలా ఉండగలను? ప్రస్తుతం నేను న్యూయార్క్లో ఉన్నా. సర్కారి పాట ప్రదర్శించబడుతున్న న్యూజెర్సీకి వెళతా..అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1
— anand mahindra (@anandmahindra) May 29, 2022