యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో లోకనాయకుడు కమల్ హాసన్ (kamal haasan) నటిస్తోన్నతాజా ప్రాజెక్టు విక్రమ్ (vikram). ఖైదీ ఫేం లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే టైటిల్తో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో విక్రమ్ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. విక్రమ్ ప్రీ రిలీజ్ఈవెంట్ (Vikram Pre Release Event) మే 31న శిల్పకళావేదికలో జరుగనుంది.
ఈ ఈవెంట్కు కమల్ హాసన్తోపాటు చిత్రయూనిట్ మెంబర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీనుంచి చీఫ్ గెస్టులు రాబోతున్నాడని తెలుస్తోండగా..వారెవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. విక్రమ్లో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీ రోల్స్ పోషిస్తున్నారు. విక్రమ్ జూన్ 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఖైదీ తర్వాత లోకేశ్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు అద్బుతమైన రెస్పాన్స్ స్పందన వస్తోంది. విక్రమ్ తెలుగు రైట్స్ ను టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది.