బెంగళూరు : కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుతున్న కొద్దీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలుస్తున్నాయి. ఈ వరుసలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో (Wipro) కూడా తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ను ముగించింది. సోమవారం నుంచి ఉద్యోగులు కార్యాలయంలో విధులకు హాజరుకానున్నారు. అది కూడా వారంలో రెండు రోజులు మాత్రమే కార్యాలయానికి వస్తారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్-19 సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ట్విట్టర్లో తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 18 నెలలుగా విప్రో సంస్థ తమ ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించేందుకు అనుమతించింది.
విప్రో ఉద్యోగులు 18 నెలల విరామం తర్వాత సోమవారం నుంచి తిరిగి కార్యాలయాలకు రానున్నారు. పూర్తిగా టీకా డోసులు తీసుకున్న విప్రో ఉద్యోగులు వారంలో రెండు రోజులు మాత్రమే కార్యాలయాలకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ‘18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మా నాయకులు తిరిగి కార్యాలయానికి వస్తున్నారు (వారానికి రెండుసార్లు). ఉద్యోగులందరికీ పూర్తిగా టీకా డోసులు వేశాం. సురక్షితంగా, సామాజికంగా దూరం పాటిస్తూ అందరూ విధులకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేం దీనిని నిశితంగా పరిశీలిస్తాం’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ట్విట్టర్లో తెలిపారు. కొవిడ్-19 భద్రతా ప్రోటోకాల్ టెంపరేచర్ తనిఖీలు, క్యూఆర్ కోడ్ స్కాన్లు ఎలా చేపడుతున్నారనే వీడియోను ఆయన షేర్ చేశారు.
దాదాపు 55 శాతం మంది భారతీయ ఉద్యోగులకు టీకాలు వేసుకున్నారని జూలై 14 న జరిగిన కంపెనీ 75 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిషద్ ప్రేమ్జీ వెల్లడించారు. భారతదేశంలో విప్రో సంస్థలో ప్రస్తుతం 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 చివరి నాటికి లేదా 2022 ప్రారంభం కల్లా 70-80 శాతం మంది ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురానున్నట్లు ఐటీ సేవల దిగ్గజ సంస్థ టీసీఎస్ ఈ నెల ఆరంభంలో తెలిపింది. ప్రస్తుతం వారంలో కొన్ని రోజులు మాత్రమే కార్యాలయానికి అనుమతించేలా చాలా కార్పొరేట్ సంస్థలు హైబ్రిడ్ మోడల్ వర్క్ను అవలంభిస్తున్నాయి.
పైలట్ తప్పిదం వల్లనే విమానం ప్రమాదం
పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి : వెంకయ్యనాయుడు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..