జంషెడ్పూర్ : దేశీయ దిగ్గజ ప్రైవేట్ ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన టాటా స్టీల్.. తమ ఉద్యోగులకు భారీగా బోనస్ (TATA Bonus) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.270.28 కోట్లను వార్షిక బోనస్గా ప్రకటించింది. ఈ బోనస్ కంపెనీలోని అన్ని విభాగాలుకు చెందిన అర్హులైన ఉద్యోగులకు వర్తించనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.34,920, గరిష్ఠంగా రూ.3,59,029 అందనున్నాయని కంపెనీ వెల్లడించింది. అలాగే, జంషెడ్పూర్లో ఉన్న వివిధ డివిజన్ల ఉద్యోగులకు రూ.158.31 కోట్లు ఇచ్చేందుకు కూడా కంపెనీ సిద్ధమైంది.
బుధవారం టాటా స్టీల్-టాటా వర్కర్స్ యూనియన్ మధ్య సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకాలు చేశాయి. ఒప్పంద పత్రాలపై టాటా స్టీల్ తరఫున సీఈఓ టీవీ నరేంద్రన్, ఉపాధ్యక్షుడు అత్రేయి సన్యాల్తోపాటు పలువురు ఎగ్జిక్యూటీవ్లు సంతకాలు చేయగా.. టాటా వర్కర్స్ యూనియన్ తరఫున సంఘం అధ్యక్షుడు సంజీవ్ కుమార్ చౌదరి, డిప్యూటీ ప్రెసిడెంట్ శైలేష్ కుమార్ సింగ్, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ సింగ్, ఇతర ఆఫీస్ బేరర్లు సంతకాలు చేశారు. అదేవిధంగా, టాటా స్టీల్ కంపెనీ-ఇండియన్ నేషనల్ మెటల్ వర్కర్స్ యూనియన్, రాష్ట్రీయ కొల్లేరి మజ్దూర్ సంఘ్ మధ్య కూడా ఒప్పందం కుదిరింది. బొగ్గు గనులు, ఎఫ్ఏఎండీ ఉద్యోగులకు వార్షిక బోనస్గా రూ.74.04 కోట్లు ఇవ్వనున్నారు.
టాటా స్టీల్-టిస్కో మజ్దూర్ యూనియన్ మధ్య బుధవారం మరో సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకాలు చేశారు. గ్రోత్ షాప్ వార్షిక బోనస్గా రూ.3.24 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని టాటా స్టీల్ తన ప్రకటనలో పేర్కొన్నది. కాగా, వార్షిక బోనస్ ప్రకటించడం పట్ల ఉద్యోగులు టాటా స్టీల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ బస్సులపై సీబీఐ విచారణ షురూ!
ఇరాన్లో కరోనా సంక్షోభం.. బ్లాక్లో వ్యాక్సిన్లు
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..