శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదుల తూటాలకు జేసీఓ బలయ్యారు. ఈ ఎన్కౌంటర్ రాజౌరీ జిల్లాలో చోటు చేసుకున్నది.
రాజౌరీ జిల్లా పరిధిలోని తనమండి ప్రాంతంలో భారత భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య కాల్పులు సంభవించాయి. ఈ ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఒకరు అమరుడయ్యారు. ఉగ్రవాదులు తనమండి ప్రాంతంలోని ఒక ఇంట్లో తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించాయి. వీరి సూచనలను ఖాతరు చేయని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జేసీఓను సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదే ప్రాంతంలో ఆగస్ట్ 6 వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
నకిలీ వ్యాక్సిన్ల గుర్తింపు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..